ఒలింపిక్ పతక విజేత మరియు పార్లమెంటు సభ్యురాలు మేరీ కోమ్ అత్యాచారాలు పెరగడంపై బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి బాక్సర్ ఐన ఈమె మహిళలు తమను తాము రక్షించుకోవడానికి బాక్సింగ్ మరియు కరాటే నేర్చుకోవాలని అన్నారు.దేశంలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరియు అత్యాచార కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళల భద్రత కోసం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చారు.