ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా మహిళ నేతలకు మరో శుభవార్తను ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.
అయితే ఇందులో ఒక ఎమ్మెల్సీ పదవీని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన.. మరోకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఈ రెండు ఎమ్మెల్సీ పదవులు మహిళలకే కేటాయించనున్నారని అందరికి ఆర్ధమైంది. దీంతో ఎమ్మెల్సీ పదవులకై మహిళ నేతలు గట్టిగా పోటి పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది మహిళా నేతల పేర్లు ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.