తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే గోదావరి నదిలో అత్యధికంగా నీళ్లు ఎక్కువగా అంటే ఏడాదికి ఐదారు నెలలు పాటు నిల్వ ఉండే చోటు దుమ్ముగూడెం.
దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై బరాజ్ నిర్మాణానికి తెలంగాణ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట ప్రగతి భవన్ లో జరిగిన క్యాబినేట్ సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రూ.3,482కోట్ల అంచనా వ్యయంతో 37టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టనున్న ఈ బరాజ్ నిర్మాణానికి మంత్రి వర్గం నిన్న ఆమోదం తెలిపింది. అయితే మొదట దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును పెంచాలని నిర్ణయించిన కానీ నీళ్లు ఎక్కువగా స్టోర్ చేసేందుకు బరాజ్ నిర్మించడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం దుమ్ముగూడెం నిల్వ సామర్థ్యం 0.94టీఎంసీల మాత్రమే ఉంది.