సీఆర్ పీసీ చట్టం ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరిగేలా చట్టం తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సోదర సోదరీ మణుల కోసం వారిని ఎవరైనా ఇబ్బందులు పెడితే తక్షణ చర్యలు ఉంటాయని తెలియ చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 40 రోజులు పట్టే సమయాన్ని కూడా 21 రోజులకు కుదించడం నిజంగా అభినందనీయం అన్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసి వచ్చారు. సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని కోరారు. చిరంజీవి దంపతులు ముఖ్యమంత్రి జగన్ దంపతులు కలిసి భోజనం కూడా చేశారు.
ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించిన ఉన్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల చిరంజీవి పత్రికా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేయడం నిజంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి రాజకీయంగా దూరంగా ఉండటం ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తుండడం రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ దీక్ష చేసినరోజే ఈ ప్రకటన విడుదల చేయడం ఇంకొక విశేషం అని చెప్పాలి.