తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేడు ప్రారంభించనున్నారు.
ఇందులో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి వంటి పలు అంశాలపై అవసరమైన సాహిత్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు.
తెలంగాణభవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు సమాచారం కోసం ఉపయోగించుకొనే వెసులుబాటు కల్పించారు. చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు జీవిత భీమా పరిహారాన్ని కూడా కేటీఆర్ అందించనున్నారు.