భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. వర్మ చిత్రీకరించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా పేరు మార్చుకుని ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమాలో వర్మ ప్రతి క్యారెక్టర్కు బయట ఉన్న ఏ క్యారెక్టర్ కు సంబంధం లేదని చెప్తున్నా ప్రతి క్యారెక్టర్ ను కావాలనే తీసినట్లు స్పష్టంగా సినిమా ద్వారా అర్థమైంది. చంద్రబాబును బాబు గా, లోకేష్ను ఆకాష్ గా, దేవినేని ఉమ ను దయనేని రామగా, అచ్చం నాయుడు ను బిచ్చం నాయుడు గా, రోజాను పూజా గా ఇలా అందరికీ క్యారెక్టర్లను దింపేసాడు వర్మ.. పవన్ కళ్యాణ్ కే ఏ పాల్ కే ఏ పాల్ కోడలు జ్యోతి, నారా బ్రాహ్మణి భువనేశ్వరి వారి కొడుకు దేవాన్ష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొడాలి నాని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, చివరికి పవన్ కళ్యాణ్ పక్కన నటించిన తూర్పుగోదావరి జిల్లాలో ఆశ్చర్యపడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన నాయకులు సైతం వర్మ అచ్చుగుద్దినట్టు గా దించేసాడు. వీరందరి హావభావాలు నటన ను బయట చూసిన వ్యక్తులు వర్మ అదేవిధంగా సినిమాలో కనిపిస్తూ ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.