దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యచారాల పై కేంద్రప్రభుత్వం,ప్రధాని మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు మోదీ ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం రేపిస్టులకు ప్రపంచ రాజధాని గా మారిందంటు రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. హైదరాబాద్,ఉన్నావ్ ఘటనల పై ప్రధాని మౌనంగా ఉండటాన్ని వారు తప్పుబడుతున్నారు.
దేశంలో నిత్యం మహిళలు,ఆడపిల్లల పై అత్యాచారాలు,హత్యలు జరుగుతున్న కేంద్రం ఏం చేస్తుందంటు రంజన్ చౌదరి విమర్శించారు.భారతదేశం మేక్ ఇన్ ఇండియా స్థాయి నుంచి రేప్ ఇన్ ఇండియా స్ధాయి కి దిగజారిందంటు అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఉన్నావ్ ఘటనలో బిజేపి నాయకుని ప్రమేయం ఉన్న ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఉన్నావ్ బాధితురాల్ని నిందితులు బెయిల్ నుండి వచ్చి మరీ చంపటం దారుణమన్నారు. దేశంలో ఇన్ని జరుగుతున్న ప్రధాని మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. గతంలోను అధిర్ రంజన్ చౌదరి బిజేపి నాయకుల పై వివాదాస్పద వాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై ఆమె బలహీనురాలంటు వాఖ్యలు చేసి తర్వాత క్షమాణలు చెప్పారు రంజన్..ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలు రాజకీయ వేడిని మరింత పెంచాయి..