Home / ANDHRAPRADESH / లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన స్పీకర్..!

లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన స్పీకర్..!

అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష సభ్యులు కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడినట్లు వీడియోలో స్పష్టంగా వినిపించాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్ తదితరులు అసెంబ్లీ మార్షల్న్ ను ఉద్దేశించి బూతుపదాలు వాడారన్నదానిపై అసంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ పదాలను ఉపసంహరించుకుంటే మంచిదని స్పీకర్ తెలియజేసారు. ఆవేశంలో ఒక్కోసారి అభ్యంతరకర పదాలు రావచ్చని, కాని వాటిని ఉపసంహరించుకోవడం సభా మర్యాద అవుతుందని ఆయన సూచించారు. అలాగే గురువారం నాడు టిడిపి ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీలోపలికి గుంపుగా రావడానికి ప్రయత్నించినవారిలో సభ్యులు కాని వారు ఉంటే గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పీకర్ పోలీసులకు అధేశాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో ముఖ్యంగా చంద్ర బాబు తనయుడు లోకేష్ ఉండటం గమనార్హం మార్షల్స్ తో జరిగిన వాగ్వాదంలో లోకేష్ వీరంగం సృష్టించాడు. ఈయన పై పోలీసులు కేసు నమోదు చేస్తారో చేయరో వేచి చూడాల్సిఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat