Home / ANDHRAPRADESH / అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!

అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!

సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్‌లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సభ జరుగకుండా నిలబడి చేస్తున్న గొడవకు సీఎం జగన్ చిర్రెత్తిపోయారు. అంతే ఒక్కసారిగా పైకి లేచి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.. మా వాళ్లు 151 మంది ఉన్నారు అధ్యక్షా…వాళ్లు 20 మంది ఉన్నారు..మావాళ్లు లేచారంటే..మీరు ఎవ్వరు కూడా స్థానాల్లో కూర్చోలేరంటూ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. చంద్రబాబు కోపంతో చూస్తుండడంతో జగన్‌కు మరింత చిర్రెత్తింది…వెంటనే..రెండు కళ్లు పెదవి చేసి చూస్తే భయపడతామా..ఎవరూ భయపడరూ..మీ వాళ్లను కూర్చోమని చెప్పండి. కూర్చో..కూర్చో..అచ్చెం..అచ్చెం నాయుడు గారు కూర్చో..పర్సనాలిటీ పెరగడం కాదు బుద్ధి పెరగాలి.. కూర్చో అంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అసెంబ్లీలో చంద్రబాబు, జగన్‌ల మధ్య జరిగిన వార్‌‌ను నేషనల్ మీడియా కూడా ప్రసారం చేసింది ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్‌గా దూసుకువెళుతుంది. ఇదే సీన్‌ను డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సిన్మాలో యాజీటీజ్ దింపేశాడు..అసెంబ్లీలో చంద్రబాబు పాత్రధారి, జగన్ పాత్రధారి మధ్య సేమ్ డైలాగ్‌ను తన సిన్మాలో పెట్టేసాడు.

తాజాగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. నవంబర్ 12 న గురువారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ, వైసీపీల మధ్య వాడీ వేడిగా చర్చ జరిగింది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంగ్లీష్ మీడియంతో మాతృభాషను చంపేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలతో సహా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గగ్గోలు పెట్టారు. కాగా ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ, ఎల్లోమీడియా చేస్తున్న రాద్ధాంతంపై ప్రజల్లో తీవ్ర నిరసన పెల్లుబికింది. దీంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని మేమే ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టామని అసెంబ్లీలో క్లెయిమ్ చేసుకోబోయాడు. అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారని..ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంను తెస్తున్నారంటూ సాక్షి పేపర్ క్లిప్పింగ్‌లను చంద్రబాబు ప్రస్తావించాడు. దీంతో సీఎం జగన్ లేచి పేపర్లో వచ్చిందని చెప్పడం ఇంగ్లీష్ మీడియం వద్దని గతంలో నేను మాట్లాడానని ఆధారాలు ఉంటే చూపించు అని చంద్రబాబును ప్రశ్నించారు. న్యూస్ పేపర్ల గురించి మాట్లాడితే నేను ఈనాడు గురించి మాట్లాడాల్సి వస్తుందని జగన్ గుర్తు చేశారు. అంతే కాదు గతంలో ఇంగ్లీష్ మీడియంకు అనుకూలంగా ఈనాడులో వచ్చిన కథనాలను సీఎం జగన్ స్వయంగా చదివి వినిపించారు. టీడీపీ హయాంలో కేవలం మున్సిపల్ స్కూళ్లలోనే ప్రవేశపెట్టారని..అది కూడా నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ స్కూల్స్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చారని సీఎం జగన్ సూటిగా విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు లేచి గందరగోళం క్రియేట్ చేశారు. దీంతో సీఎం జగన్ మరోసారి బుద్దీ, జ్ఞానం ఉందా చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. దమ్ము, ధైర్యం, నిజాయితీ, సిగ్గు ఉంటే నిజాలు మాట్లాడు, అబద్ధాలు మాట్లాడుతూ అసెంబ్లీ పరువు తీయొద్దంటూ ఫుల్లుగా వార్నింగ్ ఇచ్చారు. జగన్.. కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడిపోతామా…ఎవరూ భయపడరు…కూర్చో అంటూ రెండు వేళ్లు కళ్ల వైపు చూపిస్తూ చంద్రబాబుకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. దీంతో మళ్లీ అసెంబ్లీలో పాత సీన్ రిపీట్ అయింది. మొత్తానికి కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడిపోతామా..చంద్రబాబు..అంటూ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీలో కొట్టిన డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఎన్ని సార్లు చూసినా జగన్ డైలాగ్‌లో ఆ కిక్కే వేరప్పా అంటున్నారు నెట్‌జన్లు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat