తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మహిళా సంకల్ప దీక్షను చేపట్టిన సంగతి విదితమే.
నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్మరసం ఇవ్వడంతో ఈ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ” రాష్ట్రంలో వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలి.
మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తనపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న విమర్షలపై స్పందిస్తూ దమ్ముంటే రావాలి. మద్యపానం నిషేధంపై చర్చించడానికి నేను సిద్ధమని”ఆమె సవాల్ విసిరారు.
.