తెలంగాణలోనూ ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బాల్కసుమన్ అన్నారు. ధమ్మపేట, అశ్వారావుపేట, అప్పారావుపేట తదితర ప్రాంతాల్లో ఆయిల్పామ్ను అక్కడి రైతులు సాగుచేస్తున్నారు. చెన్నూరు నుంచి 1300 మంది రైతులు ఆయా ప్రాంతాల్లోఆయిల్పామ్ సాగును అధ్యయనం చేయడానికి ఈనెల 17వ తేదీన అక్కడికి వెళ్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ తెలిపారు