Home / TELANGANA / జంతు సంరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం.. మాజీ ఎంపీ కవిత

జంతు సంరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం.. మాజీ ఎంపీ కవిత

జంతు సంరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని మాజీ ఎంపీ కవిత అన్నారు. చేవెళ్లలోని శంకరపల్లి మండల పరిధిలోని మిర్జాగూడలో రైట్ టు ఎనిమల్ సాంక్చుయరీ (వివిధ పక్షులు, జంతువులకు ఆశ్రయం ఇచ్చేది) కవిత ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణ పశు సంవర్ధక శాఖ సహకారంతో నాంపల్లిలో, జబి ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయించి, ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తద్వారా దేశంలో జంతు సంరక్షణ కోసం చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందున్నారు. ఇంట్లో వాళ్లకు సేవలు చేయడానికే అసహనానికి గురయ్యే ఈ రోజుల్లో..డబ్బును ఆశించకుండా, జంతు సంరక్షణకై జబీ చేస్తున్న కృషిని కవిత ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ ఛైర్మన్ శ్రీ వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచి రవీందర్ గౌడ్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat