రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటూర్ గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సమత మామ ఎల్లయ్య (65) గుండెపోటుతో నిన్న ఖానాపూర్ మండలం గోసంపల్లెలోని తన ఇంట్లో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఎల్లయ్య సమతపై జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబీకులు చెబుతున్నారు.
సమత ఘటన జరిగిన నాటి నుండి దిగాలుగా ఉండేవాడని ఆ దిగులుతో శనివారం ఉదయం గుండెపోటు వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. అసలే సమతపై జరిగిన ఘోరంపై కన్నీరుమున్నీరవుతున్న ఆ కుటుంబాన్ని ఆమె మామ మృతి మరింత కుంగదీస్తోంది.