అలనాటి సీనియర్ హీరోయిన్.. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన శైలీలో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్నారు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఫైటర్..
ఈ మూవీ ద్వారా హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ బాధ్యతను తీసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటించనున్నది. ఈ మూవీతో దక్షిణాదిలో ఆమె అడుగుపెట్టనున్నారు.