ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నారు. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు కోసం చాలా కాలంగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వారి డిమాండ్ ను పరిష్కరిస్తూ కర్నూలు కు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుందని, అక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేసినట్లు ఉంటుందని సీఎం జగన్ రెడ్డి భావిస్తున్నారు.
తాజాగా జగన్ కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్నూలులో హైకోర్ట్ పెట్టాలని రాయలసీమ వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు. గత ఐదేళ్లలో కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసే విషయాన్ని చంద్రబాబు సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్ కర్నూలులో హెకోర్ట్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేయడంతో రాయలసీమా వాసుల చిరకాల కాంక్ష నెరవేర్చతున్నట్లు తెలుస్తుంది.