ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం 3,295 ఎకరాల భూసేకరణ చేయుటకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం కడప స్టీల్ ప్లాంట్కు ఐరన్ఓర్ సరఫరాపై ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. సీఎం వైయస్ జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) అలోక్కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పి.మధుసూదన్ సంతకాలు చేయడం జరిగింది.