తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఆర్&బీ అతిథి గృహంలో నియోజకవర్గానికి చెందిన సర్పంచులతో ఎమ్మెల్యే గొంగిడి సునీత సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో భవనం పైకప్పు పెచ్చులూడి పక్కనే కూర్చుని ఉన్న గొలనుకొండ సర్పంచ్ లక్ష్మీ,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మరుగాడు ఇందిరా తలపై పడింది. దీంతో సర్పంచ్ లక్ష్మీకి తలపై తీవ్రగాయాలయ్యాయి.
ఇందిరాకు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే సరిగ్గా పెచ్చులూడి పడే సమయానికి పదిహేను నిమిషాలకు ముందు ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే గొంగిడి సునీత పక్కగా కూర్చోవడంతో ఆమెకు పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడినవారికి ఆలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సనందిస్తున్నారు.