టాలీవుడ్ టాప్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే, టబు, సుశాంత్ ముఖ్య పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమన్ సంగీతమందిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.
ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కానున్నది. ఈ మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను తిరగరాస్తుంది.
ఈ క్రమంలో ప్రీ రీలీజ్ బిజినెస్ లో కూడా రికార్డుల దిశగా దూసుకుపోతుంది. నైజాం బిజినెస్ రూ. 20కోట్లు.. సీడెడ్ రూ.12కోట్లకు చేరుకుంది. ఇక ఓవర్సీస్ రైట్స్ రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది. మిగిలిన ఏరియాల్లోనూ భారీగా రేటు పెట్టినట్లు సమాచారం.