టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబును రెబల్ స్టార్ ప్రభాస్ దాటారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ఎంటర్ ట్రైన్మెంట్ టాప్-100 జాబితాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వీళ్ళు చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో ఆదాయంతో సహా వారి ర్యాంకులను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది జాబితాలో లేని ప్రభాస్ ఈ సారి ఏకంగా నలబై నాలుగో స్థానంలో (రూ.35కోట్లతో)నిలిచాడు.
గతేడాది 33వ స్థానంలో నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మాత్రం (రూ.35కోట్లతో)యాబై నాలుగో స్థానానికి పడిపోయాడు. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (రూ.21.5కోట్లతో)డెబ్బై ఏడో స్థానంలో నిలిచాడు.