తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు మహాత్మ జ్యోతి బా-పూలే గురుకులం పాఠశాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన సదుపాయాలు ఎల్లప్పుడూ అందించాలని అన్నారు.
విద్యార్థులను రోజు వారి పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు మరియు విద్యార్థుల సామగ్రి పెట్టను తనిఖీ చేసి విద్యార్థులకు నెల నెల రావాల్సిన కాస్మెటిక్ అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో నీటి వసతిలో ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే గారికి సిబ్బంది మరియు ప్రధానోపాధ్యాయులు గారు వివరించారు. తక్షణమే నీటి సౌకర్యం కలిపించకుంటే సదుపాయాలు ఉన్న చోటే పాఠశాలను నిర్వహిస్తామని అన్నారు.
కేసీఆర్ గారు ఎంతో ఖర్చు పెట్టి గురుకులాల లో పిల్లలకు సదుపాయాలు కలిపిస్తున్నారని,మీరు మంచిగా చదువుకొని ఉన్నంత స్థాయి లో ఉండలాని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కంటే మెరుగ్గా తీర్చిద్దిధాలని అన్నారు..అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు మరియు షూస్ లు అందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోతె రాజ్ కుమార్,ఉపాద్యాయులు మరియు ప్రజాప్రతినిధులు,తెరాస మండల నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు…
Tags challa dharmareddy kcr ktr mla Parakala slider telangana governament telanganacm telanganacmo trs governament warangal rural