ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము.
ఫిబ్రవరి 4న మేలైన పట్టు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది
ఫిబ్రవరి7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఓడీఎఫ్++ హోదా పొందిన రెండో మహానగరంగా వరంగల్ రికార్డుకెక్కింది
ఫిబ్రవరి 16న ములుగు,నారాయణపేట రెవిన్యూ డివిజన్లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది
ఫిబ్రవరి 19న రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన ఆరవై ఆరు రోజులకు కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది