తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలను, చిన్న చిన్న పట్టణాలను పట్టించుకునేనాథుడే లేడన్నారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి, పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు.
గ్రామాల్లోని వాడవాడలకు, పట్టణంలోని ప్రతి డివిజన్లకు ప్రత్యేక నిధులు కేటాయించి పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి డివిజన్ పరిధిలోని మారుతీ నగర్, నందా నగర్, గాంధీ నగర్, సంజయ్ గాంధీ నగర్, గిరి నగర్, గురుమూర్తి నగర్, ఆదర్శ్ నగర్లలో రూ. 1.24 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే వికేకానంద శంకుస్థాపన చేశారు.