Home / ANDHRAPRADESH / టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..!

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..!

టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 28న ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన టీటీడీ పాలకమండలి సభ్యులు అనేక అంశాలపై కూలంకుశంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలపై తీర్మానాలు చేసింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేసారు. టీటీడీ బడ్జెట్‌ను అంచనాల ప్రకారం రూ.3243.19 కోట్లకు సవరించడం జరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం నుంచి రూ.1231 కోట్లు అంచనా వేస్తే.. ఇప్పుడు రూ.1285 కోట్లుగా సమీకరించడం జరిగిందని ఛైర్మన్ తెలిపారు. అలాగే ప్రసాదాలకు రూ.270 కోట్లు ఉంటే దాన్ని రూ.330 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇక తిరుమల తిరుపతిలోని పద్మావతి శ్రీనివాస మండపంలో సెంట్రలైజ్డ్‌ఏసీ ఏర్పాటుకు రూ.3 కోట్ల పైచిలుకు నిధుల విడుదలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. టీటీడీ పరిధిలో పరిపాలన భవనాలకు మరమ్మతులకు రూ. 14.5 కోట్లు మంజూరు చేయాలని, టీటీడీ అకౌంటింగ్‌ డిపార్టుమెంట్‌లో కొంత మంది సిబ్బందిని రిక్రూట్‌చేసుకోవాలని ప్రభుత్వానికి బోర్డు లేఖ రాసింది. అనుమతి వచ్చినా కొంతమందిని రిక్రూట్‌ చేయలేదు. ఆ రిక్రూట్‌మెంట్‌ కూడా పూర్తిచేయాలని పాలకమండలి తీర్మానం చేయడం జరిగిందని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

టీటీడీ తరఫున ముంబైలో దేవాలయం నిర్మించేందుకు రూ. 30 కోట్లు కేటాయించామని, అలాగే జమ్మూకశ్మీర్‌, వారణాసిలలో వెంకటేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని..ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్నట్లు ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. ఇక తిరుమలలోని వరహా స్వామి ఆలయానికి రాగి రేకులు, బంగారు పనులు చేపట్టేందుకు రూ.14 కోట్లతో టీటీడీ ఖజానా నుంచి బంగారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు..కాగా తిరుమల తిరుపతి ఘాట్‌రోడ్డు మరమ్మతుల విషయంలో రెండు, మూడు రకాల ప్రతిపాదనలు రాగా, కొన్ని పర్మినెంట్‌ రోడ్లు వేయాలని బోర్డు నిర్ఱయం తీసుకుంది. భక్తుల ప్రయాణానికి భద్రత ఉండాలని రెండు రోడ్లను బీటీతో రిపేర్‌ చేయడానికి రూ. 10 కోట్లు మంజూరు చేసింది. పర్మినెంట్‌గా సీసీ రోడ్లా.. బీటీ రోడ్లు వేయాలా.. అనేది ఎక్స్‌పర్ట్‌కమిటీ ఎన్‌హెచ్‌డివిజన్‌ లేదా ఐఐటీ చెన్నై లేదా జేఎన్టీయూ నుంచి ఒక కమిటీ వేసి రిపోర్టు తీసుకోనున్నాం. ఒకసారి రోడ్డు వేస్తే పర్మినెంట్‌గా ఉండాలి. భక్తులు ప్రయాణించేటప్పుడు స్కిడ్‌ కాకుండా ఉండేందుకు ఎక్స్‌పర్ట్‌ కమిటీతో రిపోర్టు తెప్పించాలని నిర్ణయించామని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

ఇటీవల తిరుమల, తిరుపతి పవిత్రత, బోర్డు ప్రతిష్ట మసకరబారేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై టీటీడీ దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో తిరుమలపై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు సైబర్‌సెక్యూరిటీ విభాగాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, దానికి ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాలని టీటీడీ నిర్ణయించింది. లోగడ జరిగిన కొన్ని దుష్ప్రచారాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎవరన్నా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే, పేపర్లలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఎలా కంట్రోల్ చేయాలి, అలా చేసిన వారిని వెంటనే ఎలా గుర్తించాలి, వారిపై ఎలా చర్యలు తీసుకోవాలి వీటన్నిటినీ మన సైబర్ వింగ్ పెట్టి దానికి ఒక హెడ్ గా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని అపాయింట్ చేసి, ఆయన కూడా టెక్నాలజీవైజ్ సపోర్టు కోసం ఇన్ఫోటెక్, టీసీఎస్ నుంచి అడ్వైజులు తీసుకుని ఈ డిపార్టుమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గతంలో ఓ పత్రిక ఏసయ్య అంటూ టీటీడీపై చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన వార్తా ప్రచురణపై 100 కోట్ల పరువు నష్టం దావా వేయాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. వాళ్లు ఎవరైనా మనను వ్యక్తిగతంగా దూషిస్తే ఫర్వాలేదు కానీ వాళ్లు సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిపైనే నింద మోపే విధంగా వారు పబ్లిష్ చేసారు కనుక 1000 కోట్లకు కేసు వేసినా తప్పులేదని బోర్డు సభ్యులు అన్నారని…ఈ మేరకు సదరు పత్రికపై 100 కోట్లకు పైగా పరువునష్టం దావా కేసు వేయాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

ఇకరమణదీక్షి తులు గారిని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఆర్డర్స్‌లో ఆయనకు ఇచ్చే రోల్‌గురించి వివరాలు ఇస్తాము. ఇది పూర్తిగా సలహాదారు పదవి మాత్రమేనని బోర్డు స్పష్టం చేసింది. అలాగే తిరుమల ఆలయంలో కొన్ని సేవలు రద్దు చేస్తారని చేస్తున్న ప్రచారం అవాస్తవమని, అలాంటి నిర్ణయాలేవీ బోర్డు తీసుకోలేదని. సంప్రదాయం ప్రకారం ఇప్పటిదాకా జరుగుతున్న విధంగానే పూజా, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయే తప్పా..ఎలాంటి మార్పులూ జరగలేదని వైవి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు.

వైకుంఠ ఏకాదశి రోజు కూడా గతంలో విఐపీలకు ఇచ్చిన దర్శన సమయానికి అరగంట తక్కువే ఇస్తూ, సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే సీఎం జగన్‌గారి ఉత్తర్వులను పాటిస్తున్నాం. వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వార దర్శనం ద్వాదశి రోజు కూడా తెరచిఉంచే అదే సాంప్రదాయం ఈ ఏడాదీ కొనసాగుతుంది. శ్రీరంగంలో ఉన్నట్టుగా పూర్తిగా ఉత్తరద్వారాన్ని తెరిచి ఉంచాలనే భక్తుల విన్నపం గురించి వచ్చే ఏడాది కొద్ది ముందుగా ఈ అంశంపై విస్తృతంగా చర్చపెట్టి, స్వామీజీలను, అర్చకులను, పీఠాధిపతులను, ఆగమ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ పరిధిలో ఎక్కడికక్కడ కాంట్రాక్టు బేసిస్ మీద ఉద్యోగులను తీసుకుని సంవత్సరాల తరబడి పని చేసుకుంటూ పోతున్నారు. దీనిపై ఒక హెచ్‌.ఆర్‌పాలసీ తీసుకొస్తున్నామని, ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను పరిగణలోకి తీసుకుంటూ, అవసరమైతే కొత్తవారిని చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తామని ఛైర్మన్ అన్నారు. తిరుపతి బర్డ్‌ఆసుపత్రికి చెన్నై అపోలో పనిచేస్తున్న మదన మోహన రెడ్డిగారిని ఇంచార్జ్ డైరెక్టర్ గా నియమిస్తున్నామని, ఆయన దేవస్థానం నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పుచ్చుకోవడం లేదని. త్వరలో వచ్చి ఛార్జ్ తీసుకుంటారని వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. పేదలకు, అర్హులైన వారికి, వికలాంగులకూ ఆపరేషన్లు చేసి ఈ ఇనిస్టిట్యూట్‌ను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో దాన్ని సద్వినియోగం చేసేలా పనిచేస్తామని ఛైర్మన్ అన్నారు. ఇక చివరగా అర్చకుల ఉద్యోగ విరమణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ప్రకారమే ముందుకు వెళతామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat