భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్(51) కన్నుమూశారు.
గత కొంతకాలంగా ప్రకాశ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న సోమవారం రాత్రి పావు తక్కువ ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కొన్ని నెలల క్రితమే ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తమ అపార్ట్మెంట్ భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరిచిపోకముందే తాజాగా సోదరుడు ప్రకాష్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి.