టీడీపీ అధినేత చంద్రబాబు గారికి హైదరాబాద్పై ఎంత మమకారం అంటే…నిద్రలో లేపి అడిగినా..హైదరాబాద్ను నేనే నిర్మించా అంటూ తడుముకోకుండా గొప్పలు చెప్పుకుంటాడు..గతంలో పలుమార్లు హైదరాబాద్ను నేనే నిర్మించా…హైటెక్ సిటీ నేనే కట్టా…సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మించా, హైదరాబాద్ను ప్రపంచపటంలో నేనే పెట్టా అంటూ వినేవాళ్ల చెవులు తుప్పులు వదిలేలా బాబుగారు సెల్ఫ్ డబ్బా..కొట్టుకున్నారు. తాజాగా అమరావతిలో కూడా హైదరాబాద్ ముచ్చట తీసి, తనకు తాను కాసేపు తొడకొట్టుకుని, భుజాలు చర్చుకుని మురిసిపోయారు. ఇంతకీ బాబుగారు ఏమన్నారో మీరే చూడండి.. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో రైతులను రెచ్చగొడుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నానని, ఇవాళ సతీసమేతంగా రైతుల ఆందోళనల కార్యక్రమాల్లో పాల్గొంటానని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు జనవరి 1, బుధవారం ఉదయం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని తన సతీమణి భువనేశ్వరీతో కలిసి దర్శించుకున్న అనంతరం ఎర్రుబాలెంలోని రైతుల దీక్షా శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మరోసారి బాబుగారు హైదరాబాద్పై తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు.
ఉమ్మడి రాష్ట్ర ప్రజల కోసమే నాడు ఎంతో కష్టపడ్డానని, ఐటీ దిగ్గజం బిల్గేట్స్ లాంటి ప్రపంచ మేధావులను హైదరాబాద్కు తీసుకొచ్చానని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. ఐటీ దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చి స్వయంగా టిఫిన్ వడ్డించానని చెబుతుంటే అక్కడి ఉన్న ప్రజల కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోతే… బాబుగారి ఛాతీ ముఫ్ఫై అంగుళాలు పెరిగి మరింత రెచ్చిపోయారు.. 25ఏళ్ల క్రితం హైదరాబాద్లో విజన్ 2020 ప్రారంభించానని, హైటెక్ సిటి నిర్మించి చేతలతో అభివృద్ధి ఏంటో చూపించానని చంద్రబాబు తనకు తాను శభాష్ అనుకుంటూ మురిసిపోయారు. ఇప్పుడు విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయింది. రాజధాని కోసం నాడు యజ్ఞం చేపట్టాం. నాపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, మరోసారి గట్టిగా నాపై భరోసాతోనే రైతులు భూములు ఇచ్చారంటూ…చంద్రబాబు కాలరెగరేశాడు. అసలు విశాఖలో ఎయిర్పోర్టు కోసం నాలుగేళ్లయినా భూసేకరణ జరగలేదు. అమరావతిలో రైతులు త్యాగం చేసి భూములు ఇచ్చారు. అమరావతిలో ప్లాట్లు ఇస్తామంటే.. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ కోసం రైతులు భూములు ఇచ్చారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో అవును బాబుగారు…అమరావతిలో నీ సామాజికవర్గానికి చెందినవారు కాబట్టి కొంత మంది భూములు ఇచ్చారు..అదే విశాఖలో ఎందుకు ఇస్తారంటూ కొంత మంది టీడీపీ నేతలే తమలో తాము గొణుక్కున్నారు.
ఇక చివరలో రొటీన్గా వేసే డైలాగ్ వేసి బాబుగారు తెగబాధపడిపోయారు. నా కుటుంబ సంతోషం కూడా కాదనుకుని రాష్ట్రం కోసం కష్టపడ్డాను. నాలుగేళ్లలో నా మనవడితో రెండు గంటలు కూడా గడపలేదు అని బాబుగారు సెంటిమెంట్తో జనాలకు ఆయింట్మెంట్ పూసారు. దీంతో ఎర్రుబాలెం వాసులు ఒక్కసారిగా భావోద్వేగంతో కదలిపోయారని ఎల్లోమీడియా సెంటిమెంట్ రంగరిస్తూ కథనాలు ప్రసారం చేసింది. అయితే చంద్రబాబు బిల్డప్ డైలాగులపై నెట్జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అవును బాబు…మనవడితో ఆడుకునే టైమ్ లేదని బాధపడుతున్నావనే నిన్ను పర్మినెంట్గా ఇంటికి పంపించారు..రెండు గంటలేంటీ..రాజకీయాల నుంచి తప్పుకుని పూర్తిగా మనవడితో ఆడుకోక..ఎందుకు ఊరకే ఏడుస్తున్నావంటూ .. పంచ్ల మీద పంచ్లో విరుచుకుపడ్డారు. మొత్తానికి బాబుగారి సెల్ఫ్ డబ్బా సోషల్ మీడియాలో మరోసారి హాట్టాపిక్గా మారింది.