రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి.
ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, అన్నీ ఏసీ తరగతులకు కిలోమీటరుకు నాలుగు పైసల చొప్పున చార్జీలను పెంచారు.
శతాబ్ధి,రాజధాని,దురంతో వంటి ప్రీమియం రైళ్లకు ఈ పెంపు వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఉదహారణకు ఢిల్లీ నుండి కలకత్తాకు మధ్య దూరం 1,447కిలో మీటర్లు ప్రయాణిస్తే కిలోమీటరుకు ఒక పైసా చొప్పున మొత్తం రూ.58 మేర రైల్వే చార్జీలు పెరగనున్నాయి అన్నమాట.