భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు.
వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక రాష్ట్రంలోని తమ్కూర్ లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా మొత్తం ఆరున్నర కోట్ల మంది రైతన్నలకు లబ్ధి చేకూరనున్నది అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి బడ్జెట్ సందర్భంగా ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది .