తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు దుబ్బాక మండలం ధర్మారం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణలోని పల్లెలు.. గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ప్రతి పల్లె ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ధర్మారంలో ఇందుకు మోడల్ గొర్రెల హాస్టల్ నిర్మిస్తాం.. తడిచెత్త .. పొడిచెత్త సేకరణకు ట్రాలీలను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు అధికారులకు సూచించారు. ఈ కార్ఫ్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ,బక్కి వెంకటయ్య,డీపీఓ సురేష్ పలువురు హాజరయ్యారు.