తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో బూతులు మాట్లాడడంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు…బోండా గారికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తాయి. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రేయ్..అరేయ్..పాతేస్తా..నా కొ…కా అంటూ బూతులు మాట్లాడిన ఘనులు మన బోండా గారు. అంతే కాదు పబ్లిక్గా కూడా అధికారులను బూతులతో కించపర్చడం బోండాకు అలవాటుగా మారిపోయింది. ఒక ప్రజా ప్రతినిధిని అనే ఇంగిత జ్ఞానం లేకుండా బోండా బూతులతో విరుచుకుపడతాడు.
తాజాగా అమరావతి ఆందోళనకారులు జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావించిన పోలీసులు టీడీపీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే జాతీయ రహదారి దిగ్భంధనం కార్యక్రమానికి ఇంటి నుంచి బయలుదేరిన బోండా ఉమను కూడా బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సార్..మీరు బయటకు రావద్దు..పై అధికారుల నుంచి ఆదేశాలున్నాయి. ఇంటి నుంచి బయటకు రాకండి అంటూ పాపం ఎస్సై మర్యాదపూర్వకంగానే చెబుతున్నా బోండా మాత్రం నోరుపారేసుకున్నాడు.
అరేయ్..రేయ్..ఎవడ్రా నాకు చెప్పడానికి అంటూ బూతులు తిడుతూ..ఎస్పై, కానిస్టేబుళ్లపై విరుచుకుపడ్డాడు. పద్దతిగా ఉండూ..ఏయ్ నోర్ముసుకో అంటూ వేలు చూపిస్తూ ఎస్సైపై రెచ్చిపోయాడు . నోర్ముసుకో అని మీరు మాట్లాడద్దు అని ఎస్సై అంటే..ఏయ్..ఉండవోయ్ నువ్వు అంటూ బోండా నోరు పారేసుకున్నాడు. మా ఇంట్లోకి వచ్చి నువ్వేంటయ్యా..నా ఇంట్లో రామాకు నువ్వు … నువ్వు ఎవడైతే నాకేంటీ అంటూ బోండా ఎస్సైని కించపరిచారు.. మీరు అలా మాట్లాడడం సరికాదని ఎస్సై అంటే..నోర్ముయ్..నోర్ముయ్..నువ్వేమన్నా ఖాకీ చొక్కా వేసుకున్నానని అనుకుంటున్నావా..ఆఫ్ట్రాల్ ఉద్యోగివి..ఉద్యోగం చేసుకో..లేకపోతే నీ చొక్కా ఎలా విప్పించాలో తెలుసు..అంటూ బూతులతో రెచ్చిపోయారు. కాగా బోండా బూతుపురాణంపై పోలీస్ వర్గాలు నివ్వెరపోయాయి. ఒక ప్రజా ప్రతినిధి అయి వుండి..పోలీసులను బూతులను తిట్టడం సరికాదని పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. మొత్తంగా పోలీసులపై బోండా బూతు పురాణంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది.