చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ఎప్పుడూ ప్రజల తరుపున మాట్లాడింది లేదు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నతకాలం తన కుటుంబం, సొంతవాళ్ళ కోసమే చూసుకున్నారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయాక రాజధాని అమరావతి విషయంలో మాత్రం ప్రజల తరుపున పోరాటం చేస్తున్నారు అని అందరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మొదటికే మోసపోవడం అవుతుంది. ఈ కొత్త అవతారాలన్నీ వారి కులస్థుల మరియు పార్టీ ఆస్తులు కాపాడుకోవడానికి అని అందరికి తెలుసు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్టేనట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?” అని అన్నారు.