Home / ANDHRAPRADESH / ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిల ద్రోహం..టీజీ సంచలన వ్యాఖ్యలు..!

ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిల ద్రోహం..టీజీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 20 రోజులుగా అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండీ నిర్వహిస్తున్నాడు. అలాగే కర్నూలు, వైజాగ్‌లలో రాజధానులు ఏర్పాటు చేయద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగించాలంటూ బాబు రచ్చచేస్తున్నాడు…విశాఖలో రాజధాని పెడితే తుఫానులు వస్తాయని…అలాగే కర్నూలు రాజధానిగా పనికారాదని, తరచుగా వరద ముప్పు ఉంటుందంటూ…చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీజీ వెంకటేష్ ప్రశంసించారు. ఇక వైజాగ్, కర్నూలు నగరాలకు తుఫాన్లు, వరదల ముప్పు ఉందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టీజీ తిప్పి కొట్టారు. కర్నూలులో వరదలు వస్తాయని చంద్రబాబు అంటున్నాడు..అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ టీజీ వెంకటేష్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, సుజనా చౌదరిలు కుమ్మక్కై ఏపీ ప్రజలకు చేసిన ద్రోహాన్ని టీజీ వెంకటేష్ బయటపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తానంటే..చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి‌లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారని…అయితే ప్యాకేజీ తీసుకుంటే నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు క్రెడిట్‌ వస్తుందనే భయంతో, ఆ తర్వాత హోదాపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. మొత్తంగా ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిలు ద్రోహం చేసిన విషయాన్ని టీజీ వెంకటేష్ బయటపెట్టారు. ప్రస్తుతం టీజీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ప్రత్యేక హోదాపై మోసం చేసిన చంద్రబాబు, సుజనాలపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat