Home / ANDHRAPRADESH / అమ్మ అశ్వనీదత్.. అందుకే చిరుమీద చిందులేస్తున్నావా…!

అమ్మ అశ్వనీదత్.. అందుకే చిరుమీద చిందులేస్తున్నావా…!

ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏపీకీ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. అభివృద్ది, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న చిరు..సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందంటూ ఓ ప్రెస్‌నోట్ కూడా విడుదల చేశారు.. కాగా మరో మెగా బ్రదర్ నాగబాబు మాత్రం..అటు అమరావతి రైతులకు, ఇటు మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా మధ్యస్తంగా మాట్లాడుతున్నారు. కాగా మూడు రాజధానులపై మెగా బ్రదర్స్‌లోనే భిన్నాభిప్రాయాలు నెలకొన్న వేళ టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు పెద్దగా ఎవరూ స్పందించలేదు.

అయితే ఒకప్పుడు చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర , చూడాలని వుంది వంటి బ్లాక‌‌్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అగ్ర నిర్మాత అశ్వనీదత్ మూడు రాజధానుల అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులకు జై కొట్టిన చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు చిరంజీవికి ఏం తెలుసని..మూడు రాజధానులకు మద్దతు పలికారని అశ్వనీదత్ ఫైర్ అయ్యారు. అమరావతి రైతుల గురించి చిరంజీవి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. మీ సోదరుడు పవన్ కల్యాణ్ కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వెళ్లారని..ఆయన రైతులకు మద్దతుగా నిలిచిన విషయాన్ని మీరు ఎందుకు గుర్తించడంలేదని చిరంజీవిని ఏకిపారేసారు. ప్రపంచంలోనే బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైందనే సంగతి మీకు తెలియదా…అసలేం తెలుసని మూడు రాజధానులకు మద్దతు పలికారని చిరంజీవిపై అశ్వనీదత్ ఓ రేంజ్‌లో మండిపడ్డారు.

కాగా అశ్వనీదత్‌ అమరావతికి అనుకూలంగా మాట్లాడడం వెనుక అసలు విషయం వేరే ఉంది. చంద్రబాబు హయాంలో ఎక్కడో కృష్ణా జిల్లాలో పనికి రాని..40 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చిన అశ్వనీదత్ ..ప్రతిగా అమరావతిలో కోట్లాది రూపాయలు విలువ చేసే 12 ఎకరాలను అప్పనంగా కొట్టేశారు. ఇప్పుడు అమరావతిలో తన భూములకు ఎక్కడ విలువ పడిపోతుందనే భయంతోనే మూడు రాజధానుల ఏర్పాటును అశ్వనీదత్ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. పైగా తనకు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు అయిన చిరంజీవిని తిట్టడానికి కూడా అశ్వనీదత్ వెనుకాడడం లేదు. ఇదే అశ్వనీదత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..చిరంజీవి లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకొనేవాడినని వాపోయారు. ఇప్పుడు అమరావతిలో తన భూముల కోసం ఏకంగా చిరుకు ఏం తెలుసంటూ నోరుపారేసుకున్నారు…అమ్మ అశ్వనీదత్తూ…బాబు బ్యాచ్‌లో చేరావు..అందుకే నీ కుల పెత్తనం కోసం స్నేహాన్ని కూడా మరిచి..నీకు లైఫ్ ఇచ్చిన చిరంజీవిపైనే విమర్శలు చేసే స్థాయికి దిగజారావు…అంటూ మెగాభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మొత్తంగా మెగాస్టార్‌పై అశ్వనీదత్ చేసిన విమర్శలు సినీ, రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat