Home / ANDHRAPRADESH / జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి…!

జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి…!

అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. 40 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెక్ పెట్టారు. అయితే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ.. జేసీ బ్రదర్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆదివారం మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే సవాలు విసిరారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రాస్‌ జేసీ దివాకర్‌రెడ్డి అని కేతిరెడ్డి ధ్వజమెత్తారు. జేసీ బ్రదర్స్‌ ఓటమి తర్వాత తాడిప్రతిలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందన్నారు. తాడిపత్రిలో మట్కా నిర్వహించింది జేసీ సోదరులేనని తెలిపారు. జేసీ ఇప్పటికీ టీడీపీ హయాంలో పెట్టిన మట్కా పేకాట ఆడిస్తూ వారితో డబ్బులు వసూలు చేయిస్తున్నాడని కేతిరెడ్డి ఆరోపించారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం అని కేతిరెడ్డి సవాల్‌ విసిరారు. కాగా గత ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో జేసీ దివాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఆలయాల నిర్మాణం కోసం వచ్చే విరాళాలను కూడా జేసీ దివాకర్‌ రెడ్డి స్వాహా చేశారని ఆరోపించారు. గ్రామాల్లో ముఠా కక్షలు రేపేందుకు కుట్ర చేస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. మొత్తంగా జేసీ బ్రదర్స్, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ‌్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తాడిపత్రి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విసిరిన సవాల్‌కు జేసీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat