తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కొనసాగుతూ ఉంది.
ఈ క్రమంలో సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రు నగర్లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్ బూత్లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.