తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. దాదాపు 80శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోందన్న ఆయన… ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం హర్షణీయమన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు బ్రహ్మాండంగా స్పందించారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకంతో ఓటు వేశారని.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం ఖాయమన్నారు. టీఆర్ఎస్ 90 శాతం సీట్లు కైవసం చేసుకుంటుందని.. పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై… తెలంగాణ భవన్లో పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ అఖండ విజయాన్ని నమోదు చేస్తోందని చెప్పారు.
ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్కే ఓటర్లు అప్రతిహత విజయం అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఎజెండాకు… మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పని తీరుకు లభించబోతు న్న విజయమిదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం కష్టపడిన ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు పల్లా రాజేశ్వర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఓటర్లు టీఆర్ఎస్పై అచంచల విశ్వాసం ప్రదర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు.