తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాజీ స్టార్ హీరో .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే.
అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రానున్న మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున లాంఛనంగా ప్రారంభం కానున్న వీరిద్దరి కాంబినేషన్లో మూవీని పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కించాలని చూస్తున్నరని సమాచారం.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు పవన్ సరసన అందాలను ఆరబోయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క ఫ్రీ ప్రోడక్షన్ పనులూ కొనసాగుతున్నాయి. గతంలో జల్సా,అత్తారింటికి దారేది,గబ్బర్ సింగ్ మూవీల్లో ఇద్దరు హీరోయిన్లతో ఆలరించిన పవన్ ఈ మూవీలో ఎలా నటిస్తారో చూడాలి మరి..?