Home / TELANGANA / రేపు నిజామాబాద్‌లో నర్సింగ్ విద్యార్థుల కొవ్వొత్తుల మార్చ్…!

రేపు నిజామాబాద్‌లో నర్సింగ్ విద్యార్థుల కొవ్వొత్తుల మార్చ్…!

ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)  2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు అందరూ కలసి 24 వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి కొవ్వొత్తి మార్చ్ నిర్వహించనున్నారు. ఈ మార్చ్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్యశాల నుండి మొదలై గాంధీ చౌక్ వరకు వెళ్లి తిరిగి మరల ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుంటారు. అక్కడే ఈ కొవ్వొత్తి మార్చ్ ముగుస్తుంది. నిజామాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి నర్సు ఈ ర్యాలీలో పాల్గొనాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ప్రతికా ప్రకటన విడుదల చేశారు. కాగా 2020 ను నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపింది. అందువల్ల నర్సింగ్, మిడ్‌వైఫరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat