టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది”.