తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎక్కడ కూడా పోటీ ఇవ్వడం లేదు.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో 86చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ ,ఒకచోట బీజేపీ ,రెండు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీల వివరాలు ఇలా ఉన్నాయి.యాదగిరిగుట్ట, గద్వాల జిల్లా వడ్డేపల్లి(మొత్తం 10 వార్డులకు గాను కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 1, ఇతరులు ఒక స్థానం), నారాయణఖేడ్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.