తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు శనివారం ఉదయం నుండి వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల చేతులు ఎత్తేస్తుంది.
అందులో భాగంగా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తొన్న మధిర నియోజక వర్గ కేంద్రంలోనే కాంగ్రెస్ గట్టి షాక్ తగిలింది.
మొత్తం ఎనిమిది వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఎనిమిది మందిలో ఐదుగురు గెలుపొందారు. మరో మూడు చోట్ల కాంగ్రెస్ ,టీడీపీ,సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు.