తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి నెటిజన్ల మనస్సును దోచుకున్నారు. ఒకవైపు రాజకీయ కార్యక్రమాలు.. మరోవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటునే ఇంకోవైపు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు మంత్రి కేటీ రామారావు.
ట్విట్టర్లో సమస్య ఉందని పోస్టు చేయగానే వెంటనే స్పందించి నేనున్నాను అని భరోసానిస్తారు మంత్రి. తాజాగా అర్షద్ అజీజ్ అనే వ్యక్తి తన కజిన్ కుమార్తె గత మూడు రోజులుగా ఐసీయూలో ఉంది. చిన్నారి గుండెకు సర్జరీ చేయాలి. దీనికి పెద్దమొత్తంలో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు.
ఈ చిన్నారికి సాయం చేయాలని అజీజ్ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్ చిన్నారి ఆరోగ్యం గురించి తాను చూసుకుంటానని హామీచ్చారు.దీంతో నెటిజన్లు మంత్రి కేటీ రామారావుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.