తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో డెబ్బై ఒకటో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ ఆలీ,శ్రీనివాస్ గౌడ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ ,ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్ది తదితరులతో పాటుగా పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ముందుగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన మంత్రి కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.