కంటిచూపుతో చంపేస్తా…చూడు ఒక్క వైపే చూడు రెండోవైపు చూడాలనుకోకు…తట్టుకోలేవు..మాడిమసైపోతావు…నీకు బీపీ లేస్తే నీ పీఏ వణుకుతాడేమో..నాకు బీపీలేస్తే ఏపీ వణుకుద్ది.. ఇలా సిన్మాల్లో బాలయ్య వీరావేశంతో డైలాగులు కొడుతుంటే..నందమూరి అభిమానులు ఊగిపోతారు..కానీ రాజకీయాల్లో ఇవే డైలాగులు కొడితే సీన్ సితారైద్ది. విషయానికొస్తే…శాసనమండలిలొ వికేంద్రీకరణ అడ్డుకున్న టీడీపీ వైఖరికి నిరసనగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను ఎక్కడక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి 30, గురువారం నాడు హిందూపురంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ను వైసీపీ శ్రేణులు, ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నేతలు అడ్డుకుని ఘోరావ్ చేశారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గుర్తించలేని బాలయ్య గోబాక్…సీమ ద్రోహి బాలయ్య గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరసనకారుల ఆగ్రహాన్ని చూసి బాలయ్య మారుమాట్లాడకుండా కారులోనే కూర్చుండిపోయాడు. పోలీసులు అతికష్టమ్మీద బాలయ్యను అక్కడ నుంచి తరలించారు.అయితే ఒక రోజు తర్వాత బాలయ్య తనను అడ్డుకోవడంపై రెచ్చిపోయాడు.
తాజాగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. నిన్న నేను కనుసైగ చేస్తే ఏమయ్యేది…నా వెనక వందలమంది ఉన్నా.. నేను మౌనంగా ఉన్నా..నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దంటూ హెచ్చరించాడు. బాలయ్య వార్నింగ్పై సీమవాసులు మండిపడుతున్నారు. మీకు, మీ తండ్రి ఎన్టీఆర్కు, మీ బావ చంద్రబాబుకు రాజకీయభిక్ష పెట్టింది రాయలసీమ అని మర్చిపోకు..మీ స్వార్థం కోసం నువ్వు, నీ బావ చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారంటూ బాలయ్యపై సీమప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు కనుసైగ చేస్తే రైలు వెనక్కిపోవడానికో, నువ్వు రెండోవైపు చూస్తే తట్టుకోలేకపోవడానికి ఇది సిన్మా కాదు…ఇక్కడున్నది సీమ ప్రజలు…నువ్వు సైగ చేస్తే..ఏమయ్యోదో కానీ…అదే మేము కన్నెర చేస్తే తట్టుకోలేవు..మాడిపోతావు అంటూ సీమ ప్రజలు బాలయ్యకు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా బాలయ్య సిన్మా డైలాగులు కొట్టి…తన పరువు తానే తీసుకున్నాడు.