Home / BUSINESS / కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..!

కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..!

2020-21 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసిందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు.
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయమని ఆమె చెప్పారు. నూతన సాంకేతిక పద్దతులు అమలు చేస్తామని, మోదీ ఆర్థిక విధానాలకు విశ్వసనీయత పెరిగిందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివి…
 
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే లక్ష్యం
వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలి
వ్యవసాయరంగ అభివృద్ధికి 16 సూత్రాల కార్యాచరణ
కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత
నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించే పథకాలు
సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకం
కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు
సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్
దేశంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం
గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం
స్వయ సహాయక బృందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం
ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ సాయం
పాలు, చేపల రవాణాకు కిసాన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే
పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు
కృషి ఉడాన్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు
 
ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి
2020-21లో అగ్రికల్చర్‌ రీఫైనాన్స్‌ లక్ష్యం రూ.15 లక్షల కోట్లు
ఇప్పటికి 58లక్షల స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి
స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తాం
వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
వ్యవసాయానికి మాత్రం 1.60 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు
మత్స్యకారులకు సాగర్‌మిత్ర పథకం
పీపీపీ పథకం కింద మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు
ఆయుష్మాన్ భారత్ కింద 112 జిల్లాల్లోని ద్వితీయశ్రేణి పట్టణాలకు ప్రాధాన్యం
2025 నాటికి టీబీని రూపుమాపడమే సర్కార్ ధ్యేయం
బహిరంగ మల విసర్జన రహిత భారత్‌ సాధన కోసం ఓడీఎస్‌ ప్లస్ పథకం
స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు
2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగార్హులు
త్వరలో కొత్త విద్యా విధానం
మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులు
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్
వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు
పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విద్య
త్వరలో నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు
వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీపీపీ విధానం అనుసంధానం
జల్‌జీవన్‌ మిషన్‌కు 11,500 కోట్లు
 
ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400 కోట్లు
ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్న కేంద్రం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.3 వేల కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్ సిటీలు
రూ.1480 కోట్లతో నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్
ఎలక్ట్రానిక్ రంగంలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు
ఎగుమతులను ప్రోత్సహించేందుకు నిర్విక్ స్కీమ్
ప్రతి జిల్లాను ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తయారు చేస్తాం: నిర్మల
మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు
పారిశ్రామిక, వాణిజ్యరంగాల కోసం రూ.27,300 కోట్లు
త్వరలో నేషనల్ లాజిస్టిక్ పాలసీ: నిర్మల
పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని తేజస్ రైళ్లు: నిర్మల
త్వరలో జాతీయ లాజిస్టిక్ పాలసీ
అన్ని రకాల ముడిసరుకులు ఒకే చోట దొరికేలా ప్రత్యేక విధానం
అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న నిర్మల
ప్రతి ఇంటికి విద్యుత్ అందించడం మా ప్రభుత్వం సాధించిన ఘనత
రాబోయే మూడేళ్లలో ప్రీపెయిడ్‌ కరెంట్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం
 
స్మార్ట్ మీటర్లతో కరెంటు ఎవరి దగ్గరి నుంచి కొనాలో.. నిర్ణయించుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది
జాతీయ గ్యాస్ గ్రిడ్‌ను 16 వేల కి.మీ. స్థాయి నుంచి 27 వేల కి.మీ స్థాయికి విస్తరింపు
కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు
భారత నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ కనెక్షన్
లక్ష పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌
మూలకణ వైద్యవిధానం అభివృద్ధి కోసం డేటా బేస్‌ ఏర్పాటు
క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అప్లికేషన్‌ కోసం రూ.8 వేల కోట్లు
బాలిక, మహిళల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు
షెడ్యూల్‌ కులాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రూ. 85 వేల కోట్లు
షెడ్యూల్‌ తెగల కోసం రూ.53, 700 కోట్లు
దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 9 వేల కోట్లు
రాఖీగడి, హస్తినాపూర్‌, శివసాగర్‌, డోలాబీరా, ఆదిత్యనల్లూర్‌ లాంటి.. చారిత్రక ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు
విశేష పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి
రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటు
 
లోధాల్‌లో మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు
జాతీయ భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం
పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు
ఇక పన్ను చెల్లింపు దారుల చార్టర్
పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదు..త్వరలో చట్ట సవరణ
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నాన్ గెజిటెట్ పోస్టుల భర్తీకి నేషనల్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు
జమ్మూకశ్మీర్ అభివృద్ధికి రూ.30,757 కోట్లు
లద్దాక్‌ అభివృద్ధికి రూ.5,958 కోట్లు
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు 3.50 లక్షల కోట్లు
డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
బ్యాంకుల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరగాలి
కంపెనీల చట్టంలో మార్పులు తెస్తాం
ప్రభుత్వరంగ సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలు
పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.8శాతం
ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల విక్రయం
2021 నాటికి ద్రవ్యలోటు 3.5 శాతం
2020-21లో జీడీపీ అంచనా 10 శాతం
కొత్త కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15 శాతం
 
పాత కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ 22 శాతం
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 2.12 లక్షల కోట్లు
రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను
రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను
రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం
పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతి
పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమే

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat