కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో బడ్జెన్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శనివారం ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ఆదాయపన్ను శ్లాబుల్లో చోటు చేసుకున్న భారీ మార్పులు ఇలా ఉన్నాయి
* మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు
* ఆదాయపన్ను శ్లాబ్లు 3 నుంచి 6 శ్లాబ్లకు పెంపు
* ఇంతకు ముందు 0 నుంచి 2.25 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను లేదు
* ఈ సంవత్సరం నుంచి రూ. 5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు.
* రూ.5లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10శాతం ఆదాయపన్ను
* రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15శాతం పన్ను
* రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20శాతం పన్ను
* రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25శాతం పన్ను
* రూ.15 లక్షలకు పైనా ఆదాయం ఉన్నవారికి 30శాతం పన్ను