గత రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ..నినాదంతో ఆందోళన కార్యక్రమాలను నడిపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జోలె పట్టుకుని, ఊరూరా తిరుగుతూ అడుక్కుంటూ విరాళాలు కూడా సేకరించారు. లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియాటీమ్ కూడా జై అమరావతి స్లోగన్తో అమరావతి ఆందోళనలపై సామాజికమాధ్యమాలలో ప్రచారం చేస్తూ…ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక రాజధానిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై టీడీపీ కార్యకర్తలు ఎటాక్ చేసి రాళ్లు, కర్రలతో భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి…కొందరు టీడీపీ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. అయితే శాసనమండలి రద్దు నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్లు అమరావతి రైతుల ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు…కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ రాజధాని రాజకీయాన్ని హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఓ వైద్యుడిని కలిసేందుకుగాను నందిగామకు వెళ్లిన బాపట్ల ఎంపీ, వైఎస్సార్సీపీ దళిత నాయకుడు నందిగం సురేశ్పై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. జై అమరావతి అనాలంటూ ఎంపీ సురేశ్ వాహనాన్ని టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి అజయ్ చౌదరి, మరికొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలకు డిమాండ్కు ఒప్పుకోని నందిగం సురేష్ జై అమరావతి అననని..ఒక్క అమరావతే కాదు…అన్ని ప్రాంతాల అభివృద్ధే మా పార్టీ స్టాండ్ అని స్పష్టం చేశారు. దీంతో ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి ఎంపీని అక్కడ నుంచి సేఫ్గా తరలించారు. కాగా టీడీపీ కార్యకర్తల దాడిపై ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమాన్ని టీడీపీ కార్యకర్తలు హింసాత్మకంగా మార్చేందుకే ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. మొత్తంగా అమరావతి ఆందోళనలను మరోసారి హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ సోషల్ మీడియా టీమ్ చేసిన కుట్ర విఫలమైంది.