Home / SLIDER / ఆ వార్తలు అవాస్తవం- మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆ వార్తలు అవాస్తవం- మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారని గత కొద్ది రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తున్నాను.. పని చేస్తానని జూపల్లి ఉద్ఘాటించారు.

తనంటే గిట్టని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమదంతా టీఆర్‌ఎస్‌ కుటుంబమేనని జూపల్లి తేల్చిచెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది అని తెలిపారు.

అసెంబ్లీ, స్థానిక, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఫలితాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలకు ఉనికి లేకుండా పోయిందన్నారు జూపల్లి. తాను పూటకో పార్టీని మార్చే వాడిని కాదన్నారు. మంత్రి పదవి వదులుకొని రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నాను అని జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat