తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ అడ్రసులు గల్లంతయ్యాయి. వాటిని ప్రజలు బొందపెట్టారు. గత ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజలు ఆ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లను కూడా దక్కనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
రాష్ట్రమ్లోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, చౌటుప్పల్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ పాలకవర్గాల పదవీ స్వీకారోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. దేశాన్ని డబ్బు యేండ్లు పాలించిన ఏ జాతీయ పార్టీ ప్రభుత్వం చేయని గొప్ప సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారని అన్నారు.