తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రముఖ గాయకుడు.. గాయనీ గీతా మాధురి భర్త అయిన నందు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సవారి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో నందు మాట్లాడుతూ”రభసలో ఒక పాట కోసం ఆ రోజు ఉదయమే నుంచి డ్యాన్సర్లు ప్రాక్టీస్ చేశారు.
అయితే ఎలాంటి ప్రాక్టీస్ లేని జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సర్లు వేసిన స్టేప్స్ రెండు సార్లు చూసి ఒకే ఒక టేక్ లో చేశారని అన్నారు. ఈ విషయాన్ని నందు భార్య గీతామాధురి ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ పోస్టును చూసిన తారక్ అభిమానులు,నెటిజన్లు దట్ ఈజ్ తారక్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.