టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదముతో ఈ నెల ఫిబ్రవరి 17న సిఎం కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్కనైన నాటి హరిత తెలంగాణను కానుకగా ఇద్దామని టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ మరియు ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు కోరారు. ఆయన ఆదేశాలతో కోర్ కమిటి టీం ఈ సారి కూడా ధక్షిణాఫ్రికలోని మూడు రాష్ట్రాలలో (జోహన్నెస్బర్గ్ , డర్బన్ మరియు కేప్టౌన్ ) ఘణంగా వేడుకలు జరపాలని ఒల్డేజ్ హోంస్, అనాధ శరణాలయములు, హాస్పిటల్ డ్రైవ్, క్యాన్సర్ అవేర్నెస్స్ డ్రైవ్ మరియు మొక్కలు నాటించే కార్యక్రమము చేపట్టాలని నిర్ణయించడం జరిగింది, ఇట్టి భారీ చారిటీ డ్రైవ్ కార్యక్రమానికి మా చారిటీ ఇంచార్జ్ లు శ్రీదర్ అగ్గన మరియు అరవింద్ చీకోటి ల అద్వర్యములో కోర్ కమిటీ టీం అంతా ఆహర్నిశలు క్రుషి చేస్తుందని అలాగే కేప్టౌన్ ఇంచార్జ్ వీరన్న గండ్ల మరియు డర్బన్ ఇంచార్జ్ రవిన్ రెడ్డి , శ్రీనివాస్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు ఈ సందర్భంగా టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక మీడియా ఇంచార్జ్ కిరణ్ కుమార్ బెల్లి తెలియజేసారు..
గతములో కూడా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమమును, ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ గారు విసిరిన చాలేంజ్ ని టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు స్వీకరించి అట్టహాసంగా ప్రారంబించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేసారు.